Pradhan Mantri Shram Yogi Maan Dhan Yojana,Govt Scheme: నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం రూ.3000 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకానికి ఎవరు అర్హులంటే? – rs 55 month-to-month funding in pm sym scheme can fetch rs 3000 pension who’s eligible beneath this govt scheme
Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందే అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే పీఎం ఎస్వైఎం స్కీమ్. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. తాజాగా ఈ స్కీమ్పై పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ ప్రకటన చేసింది. మరి ఏ వయసు వారు ఎంత చెల్లిస్తే ఎంత మేర పెన్షన్ పొందవచ్చు అనే వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

రూ.3000 పెన్షన్ ఎలా వస్తుంది?
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ స్కీమ్ అనేది ఒక వాలంటరీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసే వారు, చిరు వ్యాపారుల వంటి అసంఘటిత రంగాల్లో పని చేసే వారి కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజ్ ఇటీవలే ఈ స్కీమ్పై పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ సులభమైన నియమం పై ఆధారపడి పని చేస్తుంది. ప్రతి నెలా ఈ పథకానికి కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్లో చేరాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.15 వేలలోపు ఉండాలి. అసంఘటిత రంగాల్లో పని చేస్తూ ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ లేదా ఎన్పీఎస్లో చేరకూడదు. ఈ పథకంలో ఎంత డిపాజిట్ చేయాలి అనేది వయసు బట్టి మారుతుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసు వ్యక్తి చేరితే నెలకు రూ.55 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వ్యక్తి చేరితే రూ.200 కట్టాల్సి వస్తుంది. దీనికి సమానంగా ప్రతి నెలా కేంద్రం చెల్లిస్తుంది. అంటే ఈ స్కీమ్లో చేరే వ్యక్తి సగం మాత్రమే చెల్లిస్తున్నట్లు అవుతుంది.
ఈ పథకంలో చేరాలనుకునే వారుక సమీపంలోని కామన్ సర్వీసె సెంటర్కి వెళ్లాలి. ప్రస్తుతం దేశంలో 4 లక్షల వరకు సీఎస్సీ కేంద్రాలు ఉన్నాయి. లేదా మాన్ ధన్ పోర్టల్ ద్వారా సొంతంగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం పీఎం ఎస్వైఎం స్కీమ్లో మార్చి 12, 2026 వరకు 52.5 లక్షల మంది లబ్ధిదారులు చేరారు. అంటే ఈ స్కీమ్పై ప్రజల్లో అవగాహన వస్తోంది. పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో చేరుతున్నారు.

