మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ చిత్రం మార్చి 13, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

* ఒక్కొక్కరు ఒక్కో చోట… విడాకుల ఇష్యూతో విజయ్ ఫ్యామిలీ చిన్నాభిన్నం!
జీ5 విడుదల చేసిన ప్రకటన ప్రకారం మార్చి 13 నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ట్రైలర్ను కూడా విడుదల చేసింది. “నిరీక్షణ ముగిసింది… భర్త మహాశయులకు విజ్ఞప్తి మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్” అనే సందేశంతో చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి తర్వాత ఇంత ఆలస్యంగా ఓటీటీకి వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, నిర్మాతగా సుధాకర్ చెరుకూరి వ్యవహరించారు. సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు.
* పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ.. మరో సినిమాకు గ్రీన్సిగ్నల్!
కథ విషయానికి వస్తే, ఈ చిత్రం ఒక భర్త జీవితం చుట్టూ తిరుగుతుంది. వ్యాపార ఒప్పందం కోసం స్పెయిన్కు వెళ్లిన హీరో అక్కడ ఒక మహిళతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో అతని భార్య చాలా పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన హీరో పరిస్థితులు, అతడు ఎదుర్కొనే సమస్యలు, వాటి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలే ఈ కథలో ప్రధానాంశం. భార్య – ప్రియురాలు మధ్య నలిగే భర్త పరిస్థితిని హాస్యభరితంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. రవితేజ కామెడీ, రొమాన్స్, వినోదం మేళవించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
