
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ (ICC Womens T20 World Cup) 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఈ మెగాటోర్నీ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్తో ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ను పాక్తో జూన్ 14న ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ జులై 5న లార్డ్స్లో జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనున్నాయి.
మొత్తం రెండు గ్రూపులుగా జట్లు తలపడనున్నాయి. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, గ్రూప్ 2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడనున్నాయి.